అంగరంగ వైభవంగా అమ్మవారి శోభాయాత్ర

పండగ అంటేనే పదిమందిని ఏకం చేసేది , వినాయక ఉత్సవాలు గాని , అమ్మవారి నవరాత్రులు గాని నిర్వహించడం వెనక ఇదొక కారణం , కానీ దేవుడి పేరుతో సంఘటితం అయ్యి ధర్మ పరిరక్షణకు పాటు పడాల్సింది పోయి పోటీ పడుతున్నాయి కొన్ని పల్లెలు… గల్లీ గల్లీకి ఒక విగ్రహం , ఒక్కో కుల సంఘానికి ఒక మండపం , ఎలా పోటీ పడుతూ అసలు సంగతి మర్చిపోతున్నారు

ఇంతటి పోటీ వాతావరణం లోనూ నిబద్దతతో, నియమ నిష్టలతో ఊరంతా ఏకమై అమ్మవారికి పూజలు నిర్వహించి నవరాత్రులు ఘనంగా నిర్వహిస్తూ ప్రత్యేకతను చాటుకుంటోంది సిద్ధిపేట జిల్లా దుబ్బాక మండల పరిధిలోని తిమ్మాపూర్ గ్రామం .

9 రోజులు ఘనంగా పూజలు జరిపించి , ఎంతో ఉత్సాహంగా శోభాయాత్ర నిర్వహించి నేడు నిమజ్జనం చేశారు

NOTE: ఊరికి ఒకటే విగ్రహం ఉండాలనే ఖచ్చితమైన ఉద్దేశం కాదు ఎన్ని ఉన్నా కలసి కట్టుగా ఉండాలనేదే సారాంశం.


AD

2 thoughts on “అంగరంగ వైభవంగా అమ్మవారి శోభాయాత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *