డీఎంకే ప్రతినిధి అన్నట్లు దేశ వ్యాప్తంగా ఉన్న గవర్నర్లు భాజపా కు ఏజెంట్లుగా పని చేస్తున్నారా ? రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరిస్తున్నారా ? తెలంగాణ రాష్ట్రం లో అయితే ప్రత్యక్ష ఆరోపణలు ప్రత్యారోపణలు జరగడం దేనికి దారి తీయనుంది ?
ఏకంగా గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలి , దాని వల్ల ఒనగూరే ప్రయేజనమే లేదు అని వినిపిస్తున్న తరుణంలో … గవర్నర్ గిరి ప్రశ్నార్థకంగా మారింది ? ఒకానొక సందర్భంలో రాజ్యాంగాన్నే మార్చాలనే మాటలు సైతం వినిపించటం దేనికి సంకేతం ..?

చిన్న చిన్న సవరణలు కాకుండా సింహ భాగం మార్పులు చేర్పులు చేయడం సాధ్యపడేనా ..?
వన్ నేషన్ వన్ కార్డు ,వన్ నేషన్ వన్ exam అన్నట్టు వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ కి దారి తీసి , దక్షిణాది భాషలను కేంద్రం కించపరుస్తోందా ..? సహజంగా ఉన్న భిన్నత్వంలో ఏకత్వం …పూర్తిగా ఏకపక్షంగా మారనుందా…?
కామెంట్ రూపం లో మీ మీ అభిప్రాయాలను తెలియజేయండి .సోషల్ మీడియా వేదికగానే చర్చిద్దాం …?

