సామాన్యుడికే నిబంధనలు

జిల్లా పరిపాలనా సౌధం అస్తవ్యస్థ పరిపాలన

రావాలమ్మా రావాలి , తడి చెత్త పొడి చెత్త వేరుగా చేసి ఇవ్వాలి.. అంటూ ఉదయం లేస్తూనే సిద్దిపేట మొత్తం మారుమ్రోగి పోతుంది.

దాదాపుగా సిద్దిపేట ప్రజలు దానికి అలవాటు పడ్డారు కూడా, పొరపాటున తడి చెత్తలో చిన్న కవర్ ముక్క పడినా వాళ్ళ చేతులతోనే వేరు చేయించడమో లేక తిరిగి ఇచ్చేయడమో చేస్తుంటారు మున్సిపాలిటీ వర్కర్లు…

ఇలాంటి నిబంధనలు కేవలం సామాన్యులకేనా ? నాయకులు అధికారులకు వర్తించవా ? అంటే అవుననే చెప్పాలి.

స్వచ్ సర్వేక్షన్ లో అవార్డులు అందుకునే సిద్దిపేటలో అధికారులు మాత్రం స్వచ్ఛత ను ఏమాత్రం పాటించడం లేదు

కలెక్టర్ కార్యాలయంలో తడిపొడి చెత్త కలిసిన ట్రాక్టర్

ప్రజలంతా స్వచ్ఛతను పాటిస్తుంటే అధికారులు అలసత్వం వహిస్తున్నారు. పట్టణ ప్రజలు విధిగా తడి పొడి చెత్తకోసం రెండు చెత్త బుట్టలు వాడుతుంటే. కలెక్టరేట్ లో మాత్రం వేరువేరుగా చెత్తబుట్టలే కరువయ్యాయి…

AD

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *